nanded: నాందేడ్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీపై చావుదెబ్బ... 54 స్థానాల్లో 49 కాంగ్రెస్ కైవసం

  • పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా
  • 3 స్థానాలకు పరిమితమైన బీజేపీ
  • ఉనికిని కోల్పోయిన ఎంఐఎం

అధికారంలో ఉన్న బీజేపీ, శివసేనలకు షాకిస్తూ, నాందేడ్ - వాఘాలా మునిసిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మొత్తం 54 స్థానాలకు గాను 49 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 3 స్థానాల్లో, శివసేన ఒక స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి.

గత ఎన్నికల్లో 11 మంది కార్పొరేటర్లను కలిగివున్న ఎంఐఎంకు కూడా ఈ ఎన్నికలు షాకిచ్చాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆ పార్టీ ఈ దఫా ఒక్క స్థానాన్ని కూడా పొందలేకపోయింది. ఈ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. బీజేపీపై ప్రజలకు ఆశలు ఎంతమాత్రమూ లేవని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

More Telugu News