accenture: చిన్న గొడవకే ఆక్సెంచర్ ఉద్యోగిని చంపేసిన నేరగాడు... భారీ చేజ్, ఫైరింగ్... సినీ పక్కీలో పట్టేసిన పోలీసులు!

  • బైకులు ఢీకొనడంతో ఘర్షణ
  • వెంటాడి కత్తులతో పొడిచిన నిందితుడు
  • పోలీసులపైనా దాడి
  • కాల్పుల తరువాత గాయాలతో లొంగుబాటు

ఐటీ సంస్థ ఆక్సెంచర్ కు చెందిన బెంగళూరులో శాఖలో పనిచేస్తున్న 28 ఏళ్ల టెక్కీ ప్రణయ్ మిశ్రాను ఉత్త పుణ్యానికి నేర చరిత్రగల కార్తీక్ అనే యువకుడు, తన స్నేహితుడితో కలసి హత్య చేయగా, నాటకీయ చేజింగ్, ఫైరింగ్ అనంతరం బుల్లెట్ గాయాలు తగిలిన కార్తీక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రణయ్ వెళుతున్న టూ వీలర్, రోడ్డుకు అడ్డంగా వస్తున్న కార్తీక్ బైకు స్వల్పంగా ఢీకొన్నాయి. ఆపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగగా, చుట్టూ ఉన్నవారు సర్దిచెప్పారు. ఆపై ప్రణయ్ వెళ్లిపోగా, అతన్ని వెంబడించిన కార్తీక్, అడ్డగించి కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు.

స్థానికులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులకు కార్తీక్ తారసపడగా, లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా పోలీసులపై దాడికి దిగుతూ పారిపోయాడు. చివరికి అతనిని పట్టేశారు. ఈ చేజింగ్ లో కార్తీక్ కు బుల్లెట్ గాయాలు అయ్యాయని, ఇద్దరు పోలీసు జవాన్లకు గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News