kurnool district: కర్నూలు జిల్లాలో భూమి నుంచి పొగలు, వింత శబ్దాలు

  • హాలహర్వి మండలంలో ఘటన
  • పొగలను చూసి భయభ్రాంతులైన రైతులు
  • విచారణ చేపట్టిన అధికారులు

కర్నూలు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, పొగలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని హాలహర్వి మండలం యంకెపల్లిలో భూమి నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. భారీ శబ్దం చేస్తూ పొగలు ఎగసి పడ్డాయి. ఈ నేపథ్యంలో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇలా ఎందుకు జరుగుతోందంటూ కలవరపడుతున్నారు. ఈ ఉదయం 7 గంటల సమయంలో రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి వచ్చేలోగానే పొగలు ఆగిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. 

More Telugu News