‘బంగ్లా’ కెప్టెన్ ముష్పికర్ రహీమ్: కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు: ‘బంగ్లా’ కెప్టెన్ ముష్పికర్ రహీమ్

  • దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ ఘోరపరాజయం
  • ముష్పికర్ కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ 
  • బంగ్లా క్రికెట్ బోర్డు నన్ను కోరలేదన్న ముష్పికర్

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. 2-0 తేడాతో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన ముష్పికర్.. కెప్టెన్ పదవి నుంచి తప్పుకోనని, తనను రాజీనామా చేయమని బంగ్లా క్రికెట్ బోర్డు కోరలేదని అన్నాడు. తమ జట్టు సభ్యుల ఆటతీరుపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని తాను అనుకోవడం లేదని చెప్పాడు. కాగా, మొదటి టెస్టులో 333 పరుగులు, రెండో టెస్టులో ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది.

More Telugu News