అప్పటిదాకా తలపాగా ధరించను: సచిన్ పైలట్

  • రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాతే తలపాగా ధరిస్తా
  • విజయాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థించా
  • ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోవడం బాధించింది
రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ శపథం చేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు తాను తలపాగా ధరించనని ప్రతినబూనారు. 2018లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కిసాన్ న్యాయ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ శపథం చేశారు.

2014 ఎన్నికల్లో ఒక్క లోక్ సభ స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఈ శపథం అని చెప్పారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించానని... విజయం సాధించిన తర్వాతే తాను రాజస్థానీ తలపాగాను ధరిస్తానని తెలిపారు. 
Go Back to Shorts
sachin polot
rajasthan congress committee
rajasthan congress president

More Telugu News