lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి స్పందన

  • సినిమా వెనుక రాజకీయ కారణాలు లేవు
  • వర్మ నిజాయతీ నచ్చింది
  • ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాణం వెనుక రాజకీయపరమైన కారణాలు లేవని నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి అన్నారు. కథ నచ్చడంతోనే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చానని... జరిగిన ఘటనలన్నింటినీ ఉన్నవి ఉన్నట్టు తెరకెక్కించాలన్న వర్మ నిజాయతీ తనకు నచ్చిందని ఆయన చెప్పారు.

ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చిత్ర నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. ఈ సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా తీయగలమని భావిస్తున్నామని చెప్పారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో తాను కలగజేసుకోబోనని... అదంతా వర్మనే చూసుకుంటారని తెలిపారు. వర్మ మీద తనకు 200 శాతం నమ్మకం ఉందని చెప్పారు. 

More Telugu News