mistake: మోదీకి మద్దతు ఇచ్చి రెండో తప్పు చేశా: బీజేపీ నేత, మాజీ మంత్రి అరుణ్ శౌరీ సంచలన వ్యాఖ్యలు

  • అప్పట్లో వీపీ సింగ్‌కు మద్దతు ఇచ్చా
  • గుజరాత్ అభివృద్ధి గురించి పత్రికలు ఊదరగొడితే పొరపాటుపడ్డా
  • ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి

ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అరుణ్ శౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తాను చేసిన రెండో తప్పని పేర్కొన్నారు. అప్పట్లో వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతిచ్చి తొలి తప్పు చేశానని, ఇప్పుడు నరేంద్రమోదీకి ఇచ్చి రెండో తప్పు చేశానని పేర్కొన్నారు.

‘‘నేను రెండు తప్పులు చేశా. అప్పుడు వీపీ సింగ్ (మాజీ ప్రధాని)కు, ఇప్పుడు మోదీకి మద్దతిచ్చి తప్పు చేశా’’ అని పేర్కొన్నారు. కౌసౌలీలో జరిగిన కుష్వంత్ సింగ్ ఆరో సాహితీ ఉత్సవంలో ‘పాలకులను ఎలా గుర్తించాలి... అవేంటి?’ అనే విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు ఇప్పుడేం చేస్తున్నారో దానిని అనుసరించొద్దు. గతంలో వారేం చెప్పారో దాని గురించి ఆలోచించండి’’ అని శౌరీ పిలుపునిచ్చారు.

‘‘ఇది మన గొప్ప ఫెయిల్యూర్. మన దినపత్రికలు, నాలాంటి వారు మోదీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాం. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని చెబితే నమ్మేశాం’’ అని శౌరీ పేర్కొన్నారు.

More Telugu News