sunil: పూరీ దర్శకత్వంలో సునీల్ ఎంటర్ టైనర్!

  •  తనయుడు ఆకాశ్ సినిమా పనుల్లో పూరీ
  •  ఆ తరువాత సినిమా బాలకృష్ణతో
  •  నెక్స్ట్ ప్రాజెక్టు సునీల్ తో
  •  ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధం

పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమా తన తనయుడు ఆకాశ్ తో ఉంటుందని చెప్పాడు. ఈ సినిమాకి 'మెహబూబా' అనే టైటిల్ ను ఫిక్స్ చేయడమే కాదు, కథానాయికగా 'నేహా శెట్టి'ని తీసుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఆయన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 ఈ ప్రాజెక్టు తరువాత ఆయన బాలకృష్ణ 103వ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆ తరువాత సినిమా సునీల్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇది పూరీ సొంత బ్యానర్లో ఉంటుందని అంటున్నారు. సునీల్ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని పూరీ ఒక వినోదభరితమైన కథను సిద్ధం చేశాడట. ఆ కథకు సునీల్ మాత్రమే న్యాయం చేయగలడనే నమ్మకంతో వున్నాడని అంటున్నారు. ఈ లోగా సునీల్ కూడా తాను కమిటైన సినిమాలను పూర్తి చేయనున్నాడని చెబుతున్నారు.    

More Telugu News