మోదీ: సోనియాగాంధీ, రాహుల్ బెయిల్ పై బయట ఉన్నారు: మోదీ

  • హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ
  • నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్ అధిష్ఠానంపై విమర్శలు
  • కాంగ్రెస్ నేత‌లంతా బెయిల్‌పై బ‌య‌ట ఉంటున్నార‌ని ఎద్దేవా

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ బెయిల్‌పై బయట ఉన్నారని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఆ రాష్ట్ర సీఎం వీరభద్ర సింగ్‌ ప్రభుత్వం సైతం అవినీతి కేసులు ఎదుర్కుంటోంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేత‌లంతా బెయిల్‌పై బ‌య‌ట ఉంటున్నార‌ని ఎద్దేవా చేశారు. ఆ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బిలాస్ పూర్‌లో 750 పడకల ఎయిమ్స్‌ ఆస్పత్రికి మోదీ శంకుస్థాపన చేశారు. 

More Telugu News