nagarjuna: నానితో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాను : నాగార్జున

  •  వైజయంతీ మూవీస్ బ్యానర్ పై మల్టీ స్టారర్
  •  దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య 
  •  కథానాయకులుగా నాగార్జున, నాని అంటూ ప్రచారం
  •  నిజమేనంటూ స్పష్టం చేసిన నాగ్

వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగార్జున .. నాని కలిసి నటిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమేనని తాజాగా నాగార్జున స్పష్టం చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తాను మల్టీస్టారర్ మూవీ చేయనుండటం నిజమేనని అన్నారు.

 ఈ సినిమాలో నాని పాత్ర ఎంతో సరదాగా సాగిపోతుందని చెప్పారు. ఇక తన పాత్ర కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అన్నారు. అభిమానులందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. గతంలో శ్రీరామ్ ఆదిత్య 'భలే మంచిరోజు' .. 'శమంతకమణి' సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తెరకెక్కించనున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలవుతోంది.         

More Telugu News