నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు... అవార్డులు తిరిగిచ్చే విషయంపై స్పష్టతనిచ్చిన ప్రకాశ్రాజ్
- అవార్డులు తిరిగిచ్చేంత మూర్ఖుడిని కాదు
- ప్రధాని మౌనంగా ఉన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాను
- ఏ పార్టీ గురించి మాట్లాడలేదు
`నేను మాట్లాడిన విషయాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అవార్డులు తిరిగి ఇచ్చేస్తానని వస్తున్న వార్తలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నేను కష్టపడి పని చేసి గెల్చుకున్న అవార్డులను తిరిగి ఇచ్చేంత మూర్ఖుడిని కాను. అవి నాకు గర్వకారణం` అని వీడియోలో వివరించారు. గౌరీ లంకేశ్ హత్య గురించి తాను మాట్లాడిన విషయాలపై ఆయన సరైన అర్థాన్ని కూడా చెప్పారు. `అంతటి గొప్ప పాత్రికేయురాలు హత్యకు గురైతే మన ప్రధాని ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం ఏం బాగోలేదు. ఈ విషయంలో ఆయన మౌనంగా ఉంటే ఓ పౌరుడిగా నాకు భయమేస్తోంది. తీవ్రంగా బాధ కూడా కలుగుతోంది. అందుకే ఓ పౌరుడిగా నాకు అలా అనే హక్కు ఉంది కాబట్టి స్పందించాను. కానీ దాన్ని వక్రీకరించి ప్రకాశ్ రాజ్ అవార్డులు ఇచ్చేస్తానన్నారు అని ప్రచారం చేయడం సబబు కాదు. నాకు అవార్డులు తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన కూడా లేదు.’ అని అన్నారు.