gandhi: గాంధీకి అత్యంత విలువైన నివాళి సమర్పించిన బాలిక... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

  • రూ. 2000, రూ. 500 నోట్ల మీద గాంధీ బొమ్మ‌లు చింపి ప్రాజెక్టు త‌యారీ
  • వివ‌రాలు తెలియ‌కున్నా వైర‌ల్‌గా మారింది
  • న‌వ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్న నెటిజ‌న్లు

అక్టోబ‌ర్ 2, గాంధీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎవ‌రికి న‌చ్చిన విధంగా వారు నివాళులు అర్పిస్తుంటారు. ముఖ్యంగా పాఠ‌శాల‌ల్లో వ్యాస ర‌చ‌న‌లు, డ్రాయింగ్‌లు, క్విజ్‌లు వంటి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయి. బ‌హుశా ఈ ఫొటోలో ఉన్న బాలికకు కూడా వాళ్ల టీచ‌ర్ గాంధీకి సంబంధించి ఏదైనా ప్రాజెక్టు చేసుకుర‌మ్మ‌ని పంపిందేమో!... అంద‌రి కంటే విభిన్నంగా ఉండేలా ఈ బాలిక ఆలోచించింది.

రూ. 2000, రూ. 500 నోట్ల మీద ఉన్న గాంధీ బొమ్మ‌ల‌ను చింపి త‌న ప్రాజెక్టు షీట్‌లో అంటించింది. ఈ పాప ఎవ‌రు? ఈ ఫొటో ఎక్క‌డిది? ఒరిజిన‌లా? లేక ఫొటోషాపా? వంటి వివ‌రాలేమీ తెలియ‌క పోయినా ఈ ఫొటో చూసిన ప్ర‌తి ఒక్క‌రూ దీన్ని షేర్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుస్తున్నారు.

చూడ‌టానికి అచ్చం ఒరిజిన‌ల్ మాదిరిగా క‌న్పిస్తున్న ఈ ఫొటో మీద నెటిజ‌న్లు త‌మ హాస్య ఛ‌లోక్తులు కురిపిస్తున్నారు. `ఈ ప్రాజెక్టు చూస్తే వాళ్ల టీచ‌ర్ మెచ్చుకోవ‌డ‌మేమో గానీ పాప త‌ల్లిదండ్రులు మాత్రం క‌ళ్లుతిరిగి ప‌డిపోతారు`, `గాంధీకి ఇంత‌కంటే రిచ్‌గా ఎవ‌రూ నివాళి అర్పించ‌లేరు`, `డీమానిటైజేష‌న్ ద్వారా మోదీ చేయ‌లేని ప‌ని, ఈ పాప చేసింది` అంటూ ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేశారు.

More Telugu News