అమరావతికి వస్తాను, మాట్లాడుకుందాం: చంద్రబాబుతో కేసీఆర్
- సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం
- అపరిష్కృత సమస్యలను పరిష్కరిద్దాం
- కేసీఆర్ సూచనకు చంద్రబాబు ఓకే
- త్వరలోనే అమరావతి పర్యటన
కాగా, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మకు కేసీఆర్ మొక్కులు చెల్లించుకోవాల్సి వుందన్న సంగతి తెలిసిందే. గత నెల 27నే కేసీఆర్ విజయవాడ పర్యటనకు వెళ్లాల్సి వుండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. త్వరలోనే విజయవాడ పర్యటనకు ముహూర్తం నిర్ణయించుకుని దుర్గమ్మకు తాను మొక్కుకున్న ముక్కుపుడకను కానుకగా ఇచ్చి, అనంతరం అమరావతిలో పర్యటించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.