road accident: రోడ్డు ప్రమాదం.. చిత్తూరు జాతీయ రహదారిపై నాలుగు బస్సులు ఢీ!

  • చంద్రగిరి సమీపంలో నాలుగు బస్సుల ఢీ
  • తీవ్ర గాయాలపాలైన నాలుగు బస్సుల్లోని ప్రయాణికులు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్ధానికులు

చిత్తూరులోని జాతీయ రహదారిపై ఈ ఉదయం నాలుగు బస్సులు ఢీ కొన్న ఘటన కలకలం రేపుతోంది. ఎదురెదురుగా వస్తున్న నాలుగు బస్సులు చంద్రగిరి సమీపంలో ఢీ కొట్టుకున్నాయి. దీంతో నాలుగు బస్సుల్లోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు, ఆ రహదారిపై ప్రయాణిస్తున్న ఇతరులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ తో ఈ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News