meet: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 'నాట్స్' 2019 సభ్యత్వ నమోదు

  • వచ్చేనెల 1న ‘మీట్ అండ్ గ్రీట్’ 
  • అతిథులుగా రానున్న బ్ర‌హ్మానందం, మంచు విష్ణు, ప్రగ్య

పీపుల్ టెక్ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ 2019 సంవత్సరానికి సియాటెల్ లో జరుగనున్న నాట్స్ నేషనల్ కన్వెన్షన్ కు ఆర్గనైజింగ్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సంద‌ర్భంగా అక్టోబర్ 1, 2017న సియాటెల్ లో 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది.

‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో నిర్వ‌హిస్తోన్న ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌లు స్థానిక తెలుగు సంస్థల సహకారంతో జ‌ర‌ప‌నున్నారు. ఈ కార్యక్ర‌మానికి సినీ న‌టులు బ్ర‌హ్మానందం, మంచు విష్ణు, ప్రగ్య జైస్వాల్ అతిథులుగా హాజ‌రుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల‌నుకున్న‌ వారు ఈవెంట్ బ్రైట్ (https://www.eventbrite.com/e/meet-and-greet-aay-movie-crew-brahmanandam-manchu-vishnu-pragna-jaiswal-nageswar-reddy-prabhas-tickets-38220400246) లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే...
వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు సాయం అందిస్తోంది. మూడేళ్ల పాటు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని అమెరికాలో ఈ సంస్థ సాయంతోనే నిర్వహించారు. గత సంవత్సరం సినిమా నిర్మాణం ప్రారంభించి, నాని హీరోగా, డీవీవీ దానయ్య నిర్మించిన 'నిన్ను కోరి' చిత్రం అమెరికా షూటింగ్ మొత్తం లైన్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు నిర్వహించింది. తాజాగా మంచు విష్ణు, బ్రహ్మానందం, ప్రగ్య జైస్వాల్ ప్రధాన పాత్రల్లో జి.నాగేశ్వర్ రెడ్డి  దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం అమెరికా షూటింగ్ లైన్ ప్రొడక్షన్ చేపట్టింది. ప్రస్తుతం ఈ సంస్థ నందమూరి కల్యాణ్‌ రామ్ హీరోగా రూపొందుతున్న 'ఎం.ఎల్.ఏ' చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉంది.

More Telugu News