amaravati: 24 లక్షల సార్లు గాయత్రీ మంత్రం జపించి.. హిందూ ధర్మాన్ని స్వీకరించిన ముస్లిం యువతి!

  • వైభవంగా జరిగిన సమారోపణ మహోత్సవం
  • శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి ఆధ్వర్యంలో హైందవం స్వీకరణ 
  • నాలుగేళ్లుగా గాయత్రీ మంత్రం జపిస్తున్న కౌసర్

హైందవ ధర్మాన్ని స్వీకరించాలని భావించిన ఓ ముస్లిం యువతి, 24 లక్షల సార్లు గాయత్రీ మంత్రం జపించిన అరుదైన ఘటన గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శ్రీ కోటిలింగ మహా శైవ క్షేత్రంలో తిరుపతికి చెందిన షేక్ కరిముల్లాషా కుమార్తె కౌసర్ హిందూ ధర్మాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా సమారోపణ మహోత్సవం వైభవంగా జరిగింది. పసుపు బట్టలు ధరించి, నుదుటన కుంకుమతో పీఠంపై కూర్చున్న కౌసర్ కు వేదమంత్రాల నడుమ పసుపు నీటితో అభిషేక స్నానం చేయించిన శ్రీశైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, ఆమెను హిందూ మతంలోకి ఆహ్వానించారు. వేదాచార్యుల ప్రేరణతో నాలుగేళ్ల క్రితం, జనవరి 12న తన కుమార్తె గాయత్రీ మంత్ర జపాన్ని ప్రారంభించిందని, ఈ నెల 15 నాటికి 24 లక్షల సార్లు పఠించిందని ఈ సందర్భంగా కరీముల్లాషా వెల్లడించారు.

More Telugu News