4g: రూ.6990కే ఐటెల్‌ సెల్ఫీ ప్రొ ఎస్‌42 స్మార్ట్ ఫోన్

  • ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్ ఫీచర్
  • నలుపు, బూడిద రంగుల్లో సెల్ఫీ ప్రొ ఎస్‌ 42

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్ వంటి ఫీచర్ తో రూ.6990 ధరకే ‘సెల్ఫీ ప్రొ ఎస్‌42’ పేరుతో చైనా మొబైల్ ఉత్ప‌త్తుల కంపెనీ ఐటెల్ ఈ రోజు భార‌త్‌లో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నలుపు, బూడిద రంగుల్లో వోల్ట్‌ (వీఓఎల్‌టీఈ) స‌దుపాయంతో ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేశామ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు.

ఇందులో 5 అంగుళాల డిస్‌ప్లే, 3 జీబీ రామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 1.25 గిగా హెర్జ్‌ క్వాడ్‌ కోర్‌ మీడియాటెక్‌ ప్రాసెసర్‌, 8 మెగా పిక్సెల్‌, ముందు వెనక కెమెరాలు, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఓఎస్‌,  2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం ఫీచ‌ర్లుగా ఉన్నాయి.   

More Telugu News