chandrababu: సదావర్తి భూములను కొట్టేయాలని చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారు.. సుప్రీంకోర్టును కూడా లెక్కచేయడం లేదు: ఎమ్మెల్యే ఆళ్ల

  • టీడీపీ డ్రామాలాడుతోంది
  • సీబీఐతో విచారణ జరిపించాలి
  • భూముల విలువను 60 కోట్లకు తీసుకెళ్లిన ఘనత వైసీపీదే

సదావర్తి భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఆడుతోందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విలువైన ఈ ఆస్తిని కొట్టేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు చూస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాలను కూడా వారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి, ఇంతకు ముందు తక్కువ ధరకే ఈ భూములను ప్రభుత్వం అమ్మిందని అన్నారు. భూముల విలువను రూ. 27 కోట్ల నుంచి రూ. 60 కోట్లకు వైసీపీ తీసుకెళ్లిందని చెప్పారు. ఈ భూముల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

More Telugu News