రోహింగ్యా ముస్లింలకు మద్దతు పలికిన బీజేపీ నాయకురాలిపై వేటు!
- రోహింగ్యాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు
- కన్నెర్ర చేసిన రాష్ట్ర నాయకత్వం
- వివరణ కూడా అడక్కుండానే సస్సెండ్ చేశారంటూ వాపోయిన నాయకురాలు
ఓ స్వచ్చంద సంస్థ గౌహతిలో రోహింగ్యాల కోసం ప్రార్థనా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బేనజీర్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత సమావేశం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... 'నిరసన సమావేశం' అంటూ కామెంట్ పెట్టారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం మండిపడింది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా బేనజీర్ మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ విషయంతో తాను ప్రధాని మోదీకి మద్దతు పలికానని... అలాంటి తనను కనీసం వివరణ కూడా అడక్కుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వాపోయారు.