dhoni: ధోనీతో బంధం గురించి ఇప్పుడెందుకు లెండి!: లక్ష్మీ రాయ్

  • ధోనీతో అనుబంధం చాలా కిందటి సంగతి
  • కొన్ని విషయాలు వర్కౌట్ కావు
  • మీడియా మాపై ఎక్కువ ఫోకస్ పెట్టింది
  • ధోనీ అంటే ఇప్పటికీ గౌరవం ఉంది
  • అందుకే అతని గురించి పెద్దగా మాట్లాడను

భారత్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి తెలియని వారు ఉండరన్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ మాజీ ప్రేయసి లక్ష్మీ రాయ్ మాత్రం ఊహించని ప్రశ్నతో షాకిచ్చింది. 'స్పాట్ బాయ్' వెబ్ సైట్ తో మాట్లాడుతూ, ధోనీ ఎవరు? అని ప్రశ్నించింది. ధోనీ గురించి తనను, తన గురించి ధోనీని ప్రశ్నించడానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది. తమ మధ్య చోటుచేసుకున్న సంఘటన చాలా కాలం కిందటి సంగతని తెలిపింది. ఇప్పుడతను వివాహం చేసుకుని, కుటుంబంతో ఆనందంగా ఉన్నాడని తెలిపింది. అతనికి పిల్లలు కూడా ఉన్నారని గుర్తుచేసింది. కొన్ని విషయాలు వర్కౌట్ కావని పేర్కొంది. వాటిని వదిలేసి ముందుకు సాగాల్సిందేనని తెలిపింది. తమ మధ్యనున్న అనుబంధం గురించి మీడియా ఎక్కువ ఫోకస్ చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో తమ గురించి మీడియాలో వార్తలు రాగానే తామిద్దరం వివాహం చేసుకుంటున్నట్టు కథనాలు అల్లేశారని తెలిపింది. వాటివల్ల తామిద్దరం ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపింది. అందుకనే అప్పట్లో దీని గురించి పెద్దగా మాట్లాడలేదని తెలిపింది. ధోనీ అంటే ఇప్పటికీ గౌరవముందని, అందుకే దీని గురించి పెద్దగా మాట్లాడడం లేదని తెలిపింది. కాగా, 2008లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలో లక్ష్మీ రాయ్ ఆ జట్టు అంబాసిడర్  గా ఉంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పట్లో వీరి అనుబంధం గురించి మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆ తరువాత ధోనీ వివాహం చేసుకోవడం తెలిసిందే. కాగా, 'జూలీ 2' సినిమాతో లక్ష్మీ రాయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వారి అనుబంధం మరోసారి చర్చనీయాంశంంగా మారింది. 

More Telugu News