cricket ind aus: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. పరుగుల వరద పారడం ఖాయమంటోన్న విశ్లేషకులు

చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా మ‌రికాసేప‌ట్లో టీమిండియా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మొదటి వ‌న్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. వ‌న్డేల్లో ప్ర‌స్తుతం ఇరు జ‌ట్లు స‌మఉజ్జీలుగా ఉన్నాయి. ఆస్ట్రేలియా 117 పాయింట్ల‌తో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండ‌గా, టీమిండియా అదే 117 పాయింట్ల‌తో మూడవ స్థానంలో ఉంది. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న టీమిండియా.. ఆసీస్‌పై కూడా గెలిచి మ‌రోసారి స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. ఇరు జ‌ట్లు బ‌లంగా ఉండ‌డంతో హోరాహోరి పోరు ఖాయ‌మ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. భార‌త్‌లోనే ఈ ఐదు వ‌న్డేల సిరీస్ జ‌రుగుతుండ‌డం టీమిండియాకు మ‌రో ప్ల‌స్ పాయింట్‌. ఈ సిరీస్ లో ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. 

More Telugu News