murder: తల్లిదండ్రులపై దాడి చేసిన కుమారుడు... తండ్రి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాళ్లూరులో ఘటన

తండ్రి తన సైకిల్ ను తీసుకెళ్లడంతో తనయుడు ఆగ్రహం 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మానవ సంబంధాల విలువలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయి. కన్న తల్లిదండ్రులపైనే పుత్రరత్నాలు దాడులకు పాల్పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి మండలం పాళ్లూరు గ్రామంలో ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. సైకిల్‌ కోసం ఓ కుమారుడు త‌న‌ తండ్రిని చంపేశాడు. ఆనందబాబు అనే కుర్రాడు తన తండ్రి రత్నరాజు (45)తో తరచుగా గొడ‌వ పెట్టుకుంటూ ఉండేవాడు. నిన్న రాత్రి ఆనందబాబు ఇంటికి వచ్చే సరికి అతనికి త‌న సైకిల్ క‌న‌ప‌డ‌లేదు.

ఆ సైకిలుని త‌న తండ్రి తీసుకెళ్లాడ‌ని త‌న‌ తల్లి చెప్ప‌గా తెలుసుకున్న ఆనందబాబు త‌న త‌ల్లిపై దాడి చేశాడు. అదే స‌మ‌యానికి ర‌త్న‌రాజు వ‌చ్చాడు. త‌న తండ్రితో కూడా గొడవ పెట్టుకుని కత్తితో దాడి చేసి అతనిని చంపేశాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ఆనంద‌బాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News