chaitu: భారీ నష్టం తెచ్చిపెట్టిన 'యుద్ధం శరణం'!

నాగచైతన్య కథానాయకుడిగా 'యుద్ధం శరణం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యూత్ ను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సాయి కొర్రపాటికి 11 కోట్ల వరకూ నష్టం వచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్.

 ఈ సినిమాకి చైతూ స్నేహితుడు కృష్ణ మారిముత్తు దర్శకుడిగా వ్యవహరించాడు. తన స్నేహితుడితో సినిమా చేయాల్సిందేనంటూ చైతూ పట్టుబట్టడంతో, ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో నాగార్జున జోక్యం చేసుకోలేదట. అందువల్లనే ఈ సినిమా పరాజయం పాలైందని చెప్పుకుంటున్నారు. తొందరపాటుతో చైతూ తీసుకున్న నిర్ణయం, ఆయన ఖాతాలోకి హ్యాట్రిక్ హిట్ చేరకుండా చేసిందని అంటున్నారు.     

More Telugu News