ntr: 20 మిలియన్ వ్యూస్ తో 'జై లవ కుశ' ట్రైలర్ దూసుకుపోయిందంతే!

'జై లవ కుశ' సినిమా నుంచి ఇటీవల ఒక ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఫేస్ బుక్ .. యూట్యూబ్ లలో కలిసి ఈ ట్రైలర్ 5 రోజులలో 20 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఒక్క యూట్యూబ్ లోనే 10.5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇక లైక్స్ లక్షల్లో ఉండటం విశేషం.

 ఎన్టీఆర్ కి గల క్రేజ్ కి .. ఈ సినిమా పట్ల అంతా చూపుతోన్న ఆసక్తికి ఈ వ్యూస్ కొలమానంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసమే సన్నబడిన రాశి ఖన్నా .. స్క్రీన్ పై నాజూకుగా కనిపిస్తూ మరిన్ని మార్కులు కొట్టేస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె మరికొంతమంది స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.       

More Telugu News