rajath: 'శ్రీవల్లీ'లో రాజమౌళి వాయిస్ ఓవర్ ను ఎంతమాత్రం మిస్ కాకూడదట!

రచయిత విజయేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు తాను రాసిన కథలను తానే తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఈ సారి ఆయన చేసిన ప్రయత్నమే 'శ్రీవల్లీ' సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజత్ .. నేహా హింగే జంటగా సునీత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి ముందుగానే రావాలనీ, మొదటి 5 నిమిషాలను ఎలాంటి పరిస్థితుల్లోను మిస్ కాకూడదని నిర్మాత చెబుతున్నారు. మొదటి 5 నిమిషాలు ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి వాయిస్ ఓవర్ ఉంటుందనీ, కీలకమైన ఆ వాయిస్ ఓవర్ వినడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఇక ఈ కథ .. తన జీవితంలోని ఒక విషాదమైన అనుభవంలో నుంచి పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.     

More Telugu News