: అమరావతిలో త్వరలో అతిపెద్ద జెయింట్ వీల్!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అతిపెద్ద జెయింట్ వీల్ ఏర్పాటు కానుంది. యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ఈ జెయింట్ వీల్ ను ఏర్పాటు చేయనుంది. రూ.437 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ జెయింట్ వీల్ నిర్మాణం తొలిదశను 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడుకి యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News