ntr: 'జై లవ కుశ' కోసం దిల్ రాజు 28 కోట్లు పెట్టేశాడు!

'జై లవ కుశ'లో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించాడు. ఇదే ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ కానుంది. ఈ కారణంగా ఇండస్ట్రీ వర్గాల్లోను .. అభిమానుల్లోను ఆసక్తి పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన నైజామ్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన 20 కోట్లను చెల్లించినట్టు సమాచారం.

ఇక వైజాగ్ హక్కులను కూడా 8 కోట్లకు ఆయనే సొంతం చేసుకున్నారు. ఇలా ఈ సినిమాపై ఆయన 28 కోట్ల వరకూ పెట్టేశారు. ఈ నెల 21వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా, ఈ రెండు ప్రాంతాల్లో దిల్ రాజుకి ఏ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి. కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రాశి ఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా అలరించనున్నారు.     

More Telugu News