sai dharam tej: 'జవాన్' రిలీజ్ డేట్ ఖరారైనట్టే!

వరుస పరాజయాలతో డీలాపడిన సాయిధరమ్ తేజ్ .. 'జవాన్' సినిమాతో దసరాకి కాస్త అటు ఇటుగా ప్రేక్షకుల ముందుకు వద్దామని అనుకున్నాడు. అయితే ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు, కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తే మరింత బాగా వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అంతే కాకుండా ఒక పాట షూటింగ్ కూడా పెండింగ్ లో వుంది.

దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్న సమయానికి రాలేకపోతోంది. దిల్ రాజు సూచనల మేరకు మిగతా పనులను పూర్తిచేసి, నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైనట్టేనని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ చేసిన సంగతి తెలిసిందే. తాను చేసిన 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' .. 'జవాన్' వరుసగా విడుదల కానుండటంతో మెహ్రీన్ ఫుల్ ఖుషీ అవుతోందట.     

More Telugu News