: ‘125 ఏళ్ల‌ క్రితం ఇదే రోజున’.. అంటూ సెహ్వాగ్ ట్వీట్‌!

భార‌తీయ సంస్కృతిని ప్ర‌పంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానంద 125 ఏళ్ల క్రితం సెప్టెంబ‌ర్ 11న అమెరికాలో అద్భుతంగా ప్ర‌సంగం చేసి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఆ రోజున వివేకానందుడు 'అమెరికా సోద‌ర సోద‌రీమ‌ణులారా' అంటూ త‌న ప్ర‌సంగం మొద‌లుపెట్ట‌గానే ఆ స‌భ అంతా క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో మారు మోగిపోయింది.

వివేకానందుడికే కాకుండా భార‌తీయ సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఆ రోజును భారతీయులు గుర్తు తెచ్చుకుంటున్నారు. టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తన‌దైన శైలిలో ఈ విష‌యంపై ట్వీట్ చేశాడు. 125 ఏళ్ల క్రితం.. ఇదే రోజున వివేకానందుడు షికాగోలో భార‌త్ గురించి అత్య‌ద్భుత‌మైన ప్ర‌సంగం చేశాడ‌ని అన్నాడు. ఆ రోజున వివేకానందుడు ప్ర‌సంగం చేస్తుండ‌గా తీసిన ఫొటోను కూడా సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. 

More Telugu News