: ఆస్ట్రేలియాతో తొలి మూడు వన్డేలకు భారత జట్టు ఎంపిక

ఈ నెల 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సందర్భంగా తొలి మూడు వన్డేలకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టునే సెలక్టర్లు ప్రకటించారు. వారి వివరాలు .. విరాట్ కోహ్లీ (కెప్ట్ న్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధోనీ, ధావన్, రాహుల్, పాండే, జాదవ్, రహానె, హార్థిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కులదీప్ యాదవ్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, ఉమేష్, మహ్మద్ షమి శిఖర్, చహాల్, భువనేశ్వర్ కుమార్, షమీ, పాండే లను ఎంపిక చేశారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్,  రవీంద్ర జడేజాలకు విశ్రాంతి నిచ్చారు. కాగా, ఆస్ట్రేలియాతో భారత్ మొత్తం 5 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలివన్డే చెన్నై లోని ఎంఏ చిదరంబరం స్టేడియంలో జరగనుంది.

More Telugu News