sri vishnu: 'పెళ్లి చూపులు' బాటలోనే 'మెంటల్ మదిలో'

'పెళ్లి చూపులు' బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా చాలా చిన్న సినిమా .. అయినా అది ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాను నిర్మించిన రాజ్ కందుకూరి .. సురేశ్ బాబుకి చూపించగా, ఆయనకి నచ్చి డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

 ఇక తాజాగా రాజ్ కందుకూరి .. 'మెంటల్ మదిలో' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణు .. నివేతా పేతురాజ్ నాయకా నాయికలుగా నటించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సారి కూడా రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్టు కాపీని సురేశ్ బాబుకి చూపించారట. ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంటానని సురేశ్ బాబు చెప్పారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.   

More Telugu News