: చంద్రబాబుకు లేఖ రాసిన వెంకయ్యనాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ రాశారు. అమరావతిలో తనకు చేసిన పౌర సన్మానాన్ని ఎన్నటికే మర్చిపోలేనని... అపూర్వ రీతిలో సన్మానించారని లేఖలో వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వేలాది మంది విద్యార్థులు జాతీయ పతాకాలతో స్వాగతం పలికిన తీరు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. తెలుగు గడ్డను, తెలుగు ప్రజలను తాను ఎన్నడూ మర్చిపోనని.. రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కేంద్రమంత్రిగా చివరి సంతకం చేసి... ఏపీకి మంజూరు చేసిన 2.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాను ఆవిష్కరించడం ఆనందంగా ఉదని తెలిపారు.

More Telugu News