: చంద్రబాబుకు వైసీపీ నేతలు టచ్ లో ఉంటే.. మాకు లక్షలాది ప్రజలు టచ్ లో ఉన్నారు: ధర్మాన ప్రసాదరావు

వైసీపీ నేతలు తమకు టచ్ లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నారని, అయితే, లక్షలాది ప్రజలు తమతో టచ్ లో ఉన్నారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. పోల్, పొలిటికల్, పబ్లిక్ మేనేజ్ మెంట్ గురించి నిన్న టీడీపీ వర్క్ షాప్ లో చంద్రబాబు ప్రస్తావించడం విదితమే. ఈ అంశాన్ని ధర్మాన ప్రస్తావిస్తూ.. అన్ని రకాల మేనేజ్ మెంట్లు చేసి నంద్యాల ఉపఎన్నికలో వారు గెలిచారని ఆరోపించారు. అందుకే, పోల్, పొలిటికల్, పబ్లిక్ మేనేజ్ మెంట్ గురించి.. ఈ మూడు ‘పీ’ల గురించి చంద్రబాబు మాట్లాడారని అన్నారు. మేనేజ్ మెంట్ ద్వారా గెలవగలమనే చంద్రబాబు నమ్మారని, ఇందులో భాగంగానే నంద్యాల ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని ధర్మాన ఆరోపించారు. 

More Telugu News