: ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజీలో పరస్పరం దాడులకు దిగిన బీటెక్‌ విద్యార్థులు.. ప్రిన్సిపల్ కార్యాలయంపై కూడా దాడి!

కాలేజీలో రెండు వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థులు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. అంత‌టితో ఆగ‌కుండా ఓ వ‌ర్గానికి చెందిన విద్యార్థులు త‌మ‌ ప్రిన్సిప‌ల్ కార్యాల‌యంపై కూడా దాడి చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజీలో క్రికెట్‌ విషయమై ఇరు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ప్రిన్సిపల్‌ ఓ వర్గానికి అండగా నిలిచారని ఆరోపించి ఆయ‌న‌ కార్యాలయంపై కూడా దాడికి దిగ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.     

More Telugu News