vijay: 'అదిరింది' రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ కంటూ ఓ ప్రత్యేకత వుంది. అక్కడ ఆయనకి మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన సినిమా వస్తుందంటే చాలు వాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. వాళ్లంతా కూడా ఇప్పుడు 'మెర్సిల్' (అదిరింది) సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల సరసన కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గతంలో విజయ్ తో అట్లీ కుమార్ చేసిన 'తెరి' తమిళంలో హిట్ కొట్టి .. తెలుగులో 'పోలీస్'గా వచ్చి నిరాశ పరిచింది. ఈ సారి మాత్రం ఈ రెండు భాషల్లో సక్సెస్ ను సాధించాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.     

More Telugu News