balakrishna: తెలుగు రాష్ట్రాల్లో 'పైసా వసూల్' ఫస్టు డే కలెక్షన్స్!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరికీ మాస్ ఆడియన్స్ ను అలరించడమే ముఖ్యమైనప్పటికీ, అందుకు వాళ్లు అనుసరిస్తూ వస్తోన్న పద్ధతులు వేరు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు పెరిగాయి. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.

 తొలి రోజున నైజామ్ లో 1.64 కోట్లు .. సీడెడ్ లో 1.8 కోట్లు .. నెల్లూరులో 37 లక్షలు .. గుంటూరులో 1.54 కోట్లు .. కృష్ణాలో 52 లక్షలు .. ఉత్తరాంధ్రలో 80 లక్షలు .. తూర్పు గోదావరిలో 70 లక్షలు .. పశ్చిమ గోదావరిలో 58 లక్షలను రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 8 కోట్ల షేర్ ను రాబట్టింది. బాలకృష్ణ కెరియర్లోనే ఇవి బెస్ట్ కలెక్షన్స్ అని అంటున్నారు.      

More Telugu News