balakrishna: 'పైసా వసూల్' హిట్ అనిపించుకోవాలంటే అంతమొత్తం రాబట్టాల్సిందే!

బాలకృష్ణ అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ ఈ రోజునే 'పైసా వసూల్' థియేటర్స్ కి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా తన జోరు చూపించింది. ఈ సినిమా టీమ్ చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు జనం దృష్టిని సినిమా వైపుకు మళ్లించాయి. ముగ్గురు హీరోయిన్లతో బాలకృష్ణ చేసిన సందడిని చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అని చెప్పుకోవాలంటే మాత్రం థియేటర్ల నుంచి 33 కోట్ల షేర్ ను రాబట్టవలసి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకి తొలి రోజున యావరేజ్ టాక్ వచ్చినా .. హిట్ దిశగా దూసుకెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, అంతకి మించిన వసూళ్లను సాధించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

More Telugu News