mahesh babu: 'స్పైడర్' పాట చిత్రీకరణ పూర్తి.. గుమ్మడికాయ కొట్టేసినట్టే!

మహేశ్ బాబు అభిమానులంతా 'స్పైడర్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ కొన్ని రోజుల క్రితమే పూర్తయింది. ఒకే ఒక సాంగ్ పెండింగ్ ఉండటంతో... ఆ పాటను చిత్రీకరించడానికి రొమేనియా వెళ్లారు. ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తయిందనేది తాజా సమాచారం. ఇక ఈ సినిమా షూటింగుకి గుమ్మడికాయ కొట్టేసినట్టే.

ఈ సినిమాను తమిళంలో కూడా రూపొందించారు గనుక, సెప్టెంబర్ 9వ తేదీన చెన్నై లో ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా తమిళ ప్రేక్షకులకు మహేశ్ బాబును నేరుగా పరిచయం చేయనున్నారు. ఈ వేడుకలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

More Telugu News