: అనుష్కాశర్మ ‘పరి’ షూటింగ్ లో విషాదం.. టెక్నీషియన్ మృతి!

బాలీవుడ్ నటి అనుష్కశర్మ నటిస్తున్న ‘పరి’ చిత్రం షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని కరోల్ బెరియాలో ఔట్ డోర్ షూటింగ్ లో జరిగిన ఈ విషాద సంఘటనలో షా ఆలమ్ (28) అనే టెక్నీషియన్ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్ ముగిసిన తర్వాత లొకేషన్ లోని ఓ వెదురు పొదలోని విద్యుత్ వైర్ ను అతను ముట్టుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. షూటింగ్ లో భాగంగా ఓ వెదురు పొద చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయగా, విద్యుత్ ప్రసారం అవుతున్న ఓ వైర్ షా ఆలమ్ కు తగలడంతో పడిపోయాడు. వెంటనే, ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

More Telugu News