: మహిళల పాలిట అదో నరకకూపం.. బాబా 270 మందిపై అత్యాచారం చేశాడు!: గుర్మీత్ మాజీ బాడీ గార్డ్ వెల్లడి

దైవదూతగా, రాక్ స్టార్ బాబాగా ప్రకటించుకున్న మానవ మృగం గుర్మీత్ రాం రహీం సింగ్ అని అతనికి బాడీ గార్డ్ గా పని చేసిన బియాంత్ సింగ్ చెబుతున్నాడు. గుర్మీత్ రాం రహీం సింగ్ కు శిక్ష విధించి, జైలుకు తరలించిన నేపథ్యంలో అతని పాపాల చిట్టాను ఆయన బాడీగార్డ్ బియాంత్ సింగ్ బయటపెట్టాడు. ఒక ఇంగ్లిష్ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, గుర్మీత్ 270 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పాడు.

సిర్సాలో పితాజీ గుఫాగా పిలిచే గుర్మీత్ అధికారిక నివాసం యువతుల పాలిట ఓ నరకమని, అత్యాచారాలకు గురయ్యే అబలల ఆక్రందనలతో ప్రతిధ్వనించిన పాపకూపమని ఆయన తెలిపారు. భక్తిభావంతో డేరా సచ్చా సౌధాలో చేరి సేవ చేయాలనుకున్న సాధ్వీలను వంతులవారీగా బలవంతంగా అనుభవించాడని ఆయన చెప్పుకొచ్చాడు. 1995-96లో మౌంట్‌ అబులో గుర్మీత్ సత్సంగ్‌ నిర్వహించాడని గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా వేసిన క్యాంపులో ఒక టెంటుకు తాను కాపలా కాస్తుండగా, అక్కడికి చేరుకున్న గుర్మీత్ ఒక 16-17 ఏళ్ల అమ్మాయిని పిలిచి, ఆ టెంట్‌ లోకి ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, ఆ అమ్మాయి ఆర్తనాదాలు తాను స్పష్టంగా విన్నానని చెప్పాడు.

దీంతో గుర్మీత్ అంటే అసహ్యం వేసిందని ఆయన చెప్పారు. ఇక సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో ఆయన ‘గుహ’ వద్దకు చాలా మంది అమ్మాయిలు వచ్చేవారని, వారిలో ఒక యువతితో డేరాలో రాత్రంతా గడిపేవాడని ఆయన తెలిపారు. దీనిపై గార్డులంతా చర్చించుకునేవారమని ఆయన అన్నారు. అయితే ఇతర గార్డులు అతనిపై భక్తి చూపించేవారు కానీ, తాను కళ్లారా చూడడంతో వారి అభిప్రాయాలతో తాను విభేదించేవాడినని ఆయన తెలిపారు. గుర్మీత్ రేప్ చేసిన ఓ యువతి ఇప్పటికీ డేరాలోనే ఉందని ఆయన తెలిపాడు. కేవలం ఆమె మాత్రమే కాదని, 250 మందికి పైగా అమ్మాయిల్ని రేప్ చేశాడని ఆయన చెప్పారు. 300 మంది సాధ్వీల్లో 90 శాతం మంది అతడి కామదాహానికి బలైనవారేనని ఆయన సంచల విషయాలు వెల్లడించారు. గుర్మీత్ బాబాకు ఇద్దరిపై చేసిన అత్యాచారాల్లో మాత్రమే శిక్ష పడిందని ఆయన అన్నారు. ఆయన బయటకు రాకూడదని ఆయన ఆకాంక్షించారు.

More Telugu News