: చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని మరోసారి రుజువైంది... గుర్మీత్ తీర్పుపై రామ్దేవ్ బాబా వ్యాఖ్య
భారత దేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేసిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని కోర్టు మరోసారి రుజువు చేసిందని యోగాగురువు రామ్దేవ్ బాబా అన్నారు. డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు పదేళ్ల జైలు శిక్ష పడటంపై ఆయన స్పందించారు. గతంలో గుర్మీత్ కూడా రామ్దేవ్ బాబా `పతంజలి` ఉత్పత్తులకు పోటీగా `ఎంఎస్జీ` పేరుతో 151కి పైగా రకాల సంప్రదాయ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ఉత్పత్తులకు పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అదే ప్రాంతాల్లో గుర్మీత్కు మద్దతుగా అల్లర్లు జరుగుతుండటం గమనార్హం.