: కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణుల సంబరాలు!

నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నిక విజయం ప్రజలేదనని, నంద్యాల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నంద్యాలలో జగన్ తిష్టవేసి మరీ ప్రచారం చేశారని, అయినప్పటికీ ఆయన ఓడిపోయారని అన్నారు.

More Telugu News