: ఓటమిని అంగీకరించిన శిల్పా మోహన్ రెడ్డి.. రాజకీయ సన్యాసంపై తర్వాత మాట్లాడతానన్న వైసీపీ నేత

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన చాలా తక్కువగా మాట్లాడి వెళ్లిపోయారు. ఈ ఎన్నికలో టీడీపీ అభివృద్ధి వల్ల గెలవలేదని... డబ్బు అండతో గెలిచిందని ఆయన ఆరోపించారు. మైనార్టీలు కూడా టీడీపీకి ఓటు వేశారని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతానా? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటానా? అనే విషయంపై తర్వాత మాట్లాడతానని చెప్పారు. 

More Telugu News