: భూమా ఆధిక్యంపై శిల్పా మోహన్ రెడ్డి కామెంట్ ఇది!

నంద్యాల ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఫలితాల సరళిపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి స్పందించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, పూర్తి ఫలితాలు వచ్చేంత వరకూ వేచి చూస్తామని అన్నారు. ఓడినంత మాత్రాన నిరుత్సాహపడేది లేదని తెలిపారు. తుది రౌండ్ ఫలితం వెల్లడైన తరువాతనే తాను మీడియాతో మాట్లాడతానని చెప్పారు. భూమా బ్రహ్మానందరెడ్డి స్పష్టమైన ఆధిక్యత కనబరచడంపై ప్రస్తుతానికి తానేమీ చెప్పబోనని అన్నారు. కాగా, ఎనిమిదో రౌండ్ నుంచి భూమా ఆధిక్యం వేల నుంచి వందల్లోకి తగ్గిన సంగతి తెలిసిందే. తొమ్మిదో రౌండ్ తరువాత ఆయన 18 వేల ఓట్లకు పైగా మెజారిటీలో కొనసాగుతున్నారు. 

More Telugu News