: సీఎం చంద్రబాబు నివాసం దగ్గర సంబరాలు!

నంద్యాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు జరిగిన 8 రౌండ్లలో టీడీపీ ఆధిక్యం కనబరచడంపై టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా తమకు మొదటి నుంచి ఉందని, చంద్రబాబు సుపరిపాలనకు నంద్యాల ప్రజలు ఇవ్వనున్న తీర్పే తమ విజయమంటూ టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు.

More Telugu News