: జగన్ మోహన్ రెడ్డి! మీరు తలవంచుకోవాలి : మంత్రి సోమిరెడ్డి

నంద్యాల ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని, ఇరవై ఐదు వేల మెజార్టీతో తమ పార్టీ గెలుపు ఖాయమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్ మోహన్ రెడ్డి!, మీరు తలవంచుకోవాలి..మీరు ఒప్పుకోవాలి. ఇది నంద్యాల ప్రజలు ఇస్తున్న తీర్పు. ఎన్నికల ప్రచారంలో జగన్ మరో మాట అన్నారు.. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికలు ఓ సందేశం కావాలని అన్నారు. 2019లో చంద్రబాబుగారి నాయకత్వం రావాలని నంద్యాల ప్రజలు తీర్పు ఇచ్చారు. జగన్, ఆయన బృందానికి నంద్యాల ప్రజలు ఓ మెసేజ్ ఇచ్చారు. అయ్యా, జగన్..రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దయచేసి రోజాగారిని అన్ని నియోజకవర్గాల్లో తిప్పండి. ఇదే జోష్ లో మాట్లాడండి. నంద్యాలలో మాట్లాడినట్టుగానే మాట్లాడండి. వైసీపీకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News