: శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు

నంద్యాల ఉప ఎన్నికల్లో విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి సహా 8 మందిపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు తమపై గ్యాంగ్ స్టర్ మధు గ్యాంగ్ హత్యాయత్నం చేసిందని శిల్పా వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆపై మధు వర్గం కూడా పోలీసులను ఆశ్రయించి, తమను హత్య చేసేందుకు శిల్పా కుట్ర పన్నారని కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపించిన పోలీసులు శిల్పా చక్రపాణిరెడ్డిపై కేసును నమోదు చేయగా, తమను చంపాలని చూసిన మధు గ్యాంగ్ ను వదిలి తమపైనే కౌంటర్ కేసులు నమోదు చేయడం ఏంటని శిల్పా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే తమపై అక్రమంగా కేసులను బనాయిస్తోందని ఆయన విమర్శించారు.

More Telugu News