rajamouli: రాజమౌళి రంగంలోకి దిగినా పనికాలేదట!

రాజమౌళి .. సాయికొర్రపాటి మధ్య గల సాన్నిహిత్యం గురించి తెలిసిందే. సాయి కొర్రపాటి నిర్మించే సినిమాలకి రాజమౌళి తనవంతుగా మాట సాయం చేస్తుంటారు. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలను నిర్మించి సాయి కొర్రపాటి నష్టాలను చవి చూశాడు. వాటి బారి నుంచి బయటపడటానికి పెద్ద ప్రాజెక్టు ఒకటి సెట్ చేసుకోవాలని ఆయన భావించాడు. '2.0' సినిమా తెలుగు అనువాద హక్కులను 60 కోట్లకు తీసుకోవడానికి గట్టి ప్రయత్నమే చేశాడు.

 అయితే, 80 కోట్లకి తక్కువగా ఇచ్చే ఉద్దేశమే లేదని '2.0' నిర్మాతలు చెప్పడంతో, రాజమౌళిని రంగంలోకి దింపాడట. చెన్నై వెళ్లి రాజమౌళి బేరసారాలు జరిపినా నిర్మాతలు దిగి రాలేదని తెలుస్తోంది. 60 కోట్లకి మించి అనువాద హక్కులకు పెడితే రిస్క్ అవుతుందని రాజమౌళి భావించడంతో, సాయి కొర్రపాటి వెనక్కి తగ్గినట్టు సమాచారం.  

More Telugu News