allari naresh: చైతూకి పోటీగా రంగంలోకి అల్లరి నరేశ్!

అల్లరి నరేశ్ కథానాయకుడిగా ప్రజీత్ దర్శకత్వంలో 'మేడ మీద అబ్బాయి' చిత్రం తెరకెక్కింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా ద్వారా నిఖిలా విమల్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం.

అయితే ఇదే రోజున నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన 'యుద్ధం శరణం' భారీ స్థాయిలో విడుదల కానుంది. చైతూ వరుస విజయాలతో వున్న కారణంగా ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. అందువలన 'మేడ మీద అబ్బాయి'కి ఈ సినిమా గట్టిపోటీ ఇచ్చే అవకాశం వుందని అంటున్నారు. తాను చాలా కాలంగా ఎదురుచూస్తోన్న సరైన హిట్ ను అల్లరి నరేశ్ ఈ సినిమాతో అందుకుంటాడేమో చూడాలి.   

More Telugu News