: స్వైప్‌ టెక్నాలజీస్ నుంచి బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ధర రూ.4 వేలే!

స్వైప్‌ టెక్నాలజీస్ నుంచి బ‌డ్జెట్ ధ‌ర‌లో మ‌రో 4జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌లైంది. స్వైప్‌ ఎలైట్‌ 4జీ పేరుతో రూ.4,000కు అన్ని ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన‌ ఈ స్మార్ట్‌ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగ‌దారులు సొంతం చేసుకోవ‌చ్చు. బ్లాక్‌, గ్రే, గోల్డ్ క‌ల‌ర్ల‌లో ఈ ఫోన్‌ను విడుద‌ల చేశారు. యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ కార్డ్‌ హోల్డర్స్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును కూడా అందుకోవ‌చ్చు.

ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌, 5 ఇంచెస్‌ హెచ్‌డీ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 8 మెగా పిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 64 జీబీ వరకు విస్తరణ మెమరీ, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్, 3.5ఎంఎ ఆడియో జాక్ ఇందులో ఫీచ‌ర్లు. 

More Telugu News